ఆదిలాబాద్ జిల్లా బుక్తాపూర్లోని సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి ప్రజా పోరు యాత్రను తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి ప్రారంభించారు. పట్టణంలో సుమారు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ప్రజలకు వివరిస్తూ విద్య, వైద్యం, ఉపాధి రంగాలను బలోపేతం చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుంటల రాములు, షేక్ బాషా, అర్ధాంగి రమేష్, కంలే రామదాస్, షేక్ సలీం, అమ్మిన ఖాన్, షబానా, మెస్రం సంగీత, ఉమా పాల్గొన్నారు.

సిపిఐ ప్రజా పోరు యాత్ర ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా బుక్తాపూర్లోని సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి ప్రజా పోరు యాత్రను తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ముడుపు నళిని రెడ్డి ప్రారంభించారు. పట్టణంలో సుమారు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ప్రజలకు వివరిస్తూ విద్య, వైద్యం, ఉపాధి రంగాలను బలోపేతం చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుంటల రాములు, షేక్ బాషా, అర్ధాంగి రమేష్, కంలే రామదాస్, షేక్ సలీం, అమ్మిన ఖాన్, షబానా, మెస్రం సంగీత, ఉమా పాల్గొన్నారు.

