తిరుపతి ఆగస్టు 04 (పున్నమి ప్రతినిధి)
తిరుపతి నగరంలోని శ్రీ కరిమారియమ్మ ఆలయంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి మంగళవారం షష్టి తిథి ఒకే రోజున రావడంతో విశేష ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. ఈ అరుదైన పుణ్య సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధ పరిమళ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతులు నిర్వహించి భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు.


