చిత్తూరు జిల్లా ఆగస్టు 04 (పున్నమి ప్రతినిధి)
చిత్తూరు నగరపాలక పరిధిలో ఐదవ వార్డు రఘురాం నగర్ కాలనీలో వెలసిన శ్రీ శక్తి మారియమ్మ నడి వీధి గంగమ్మను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దర్శించుకున్నారు. శ్రీ శక్తి మారియమ్మ ఆడి జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నడివీధిలో ప్రతిష్టించిన అమ్మవారిని ఎమ్మెల్యే, నాయకులతో కలిసి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గజమాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. పూజల అనంతరం స్థానిక నాయకులు, జాతర కమిటీ నిర్వాహకులు,గోపాల్ ఆధ్వర్యం.లో ఎమ్మెల్యే,ను ఇతర ముఖ్య నాయకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, రాజేష్ రెడ్డి, రాజశేఖర్ నాయుడు, సీకే లావణ్య, ఈశ్వరరావు, నళిని.తిరుకుమరన్ తదితరులు పాల్గొన్నారు.



