నందలూరు మండలంలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు రైతులకు భారత రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత వైకాపా పాలనలో పేదల భూములు లాక్కున్నారని, 22ఏ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో ప్రసాద్, ఆర్ఐ సుశీల్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు జంగంశెట్టి సుబ్బయ్య, మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, నీటి సంఘం అధ్యక్షుడు బూసెట్టి వెంకటసుబ్బయ్య, మాజీ సర్పంచ్ రాము, సీనియర్ నాయకులు పల్లె సుబ్రహ్మణ్యం, ఉప్పు శెట్టి రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.



