వెల్దండ మండల కేంద్రానికి చెందిన రేవల్లి నీలయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలను అందజేశారు. కుటుంబం అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని ఎప్పుడూ అందుబాటులో ఉంటానని కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చలిచీమల నిరంజన్, 12 వ వార్డు సభ్యులు శేఖర్,5 వ వార్డు సభ్యులు రేవల్లి రాజు, జంగిలి రవికుమార్, కర్నెకంటి వెంకటయ్య, మట్ట లక్ష్మయ్య, మావిళ్ళ గణేష్ తదితరులు పాల్గొన్నారు.


