మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ.. పౌరసరఫరాల శాఖ సన్నాహాలు!
TG: రేషన్కార్డ్ లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది. 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల వరకు కేటాయించిన ఆహార ధాన్యాలు ముందుగా అందజేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభించి 31వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఇప్పటికే చౌక ధరల దుకాణాలకు బియ్యం సరఫరా చేసేందుకు సిద్ధమైంది.



