Tuesday, 15 September 2026
  • Home  
  • మనుబోలు పశువుల సంత వేలంలో రికార్డు ధర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పశువుల సంత వేలంలో రికార్డు ధర

మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పశువుల సంత వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన వేలం చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి రూ.81,10,000కు పశువుల సంత హక్కులను దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం పాట పలకడం మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. గతంతో పోలిస్తే ఈసారి వేలం ధర గణనీయంగా పెరగడంతో పంచాయతీకి ఆదాయం పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పశువుల సంత వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన వేలం చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి రూ.81,10,000కు పశువుల సంత హక్కులను దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం పాట పలకడం మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. గతంతో పోలిస్తే ఈసారి వేలం ధర గణనీయంగా పెరగడంతో పంచాయతీకి ఆదాయం పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.