విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం, సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
భీమిలి నియోజకవర్గంలోని పెద్దిపాలెం ఫ్లైఓవర్ కింద యువ నాయకులు మరి పిల్లి సాయి జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 500 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో యువ నాయకుడు శ్రీ గంటా రవితేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు, మన పూజా విధానం వల్ల ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించే బాధ్యతను మనం నిర్వర్తించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఐ టీడీపీ ఉపాధ్యక్షులు, వృక్షాపౌండేషన్ వ్యవస్థాపకులు కాకర సురేష్ కుమార్ గారు మరియు పెద్ద ఎత్తున యువకులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు
భక్తి మనసులో ఉండాలి..
బాధ్యత ప్రకృతిపై ఉండాలి.
అందుకే ప్రతి ఇంటా మట్టి గణపతిని పూజించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గంటా రవితేజ పిలుపునిచ్చారు.
🙏 మట్టి గణపతినే పూజిద్దాం..
🌿 మన ప్రకృతిని కాపాడుకుందాం..
💚 భావితరాలకు స్వచ్ఛమైన భవిష్యత్తును అందిద్దాం!
<img src="https://punnami.in/wp-content/uploads/2026/09/641074.jpg" style="max-widt


