బుచ్చిరెడ్డి పాలెం,జులై 25, ( పున్నమి ప్రతినిధి )
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ఒక కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చింది. గతంలో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికి మాత్రమే సాయం అందేది, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి బిడ్డకు రూ.13 వేల చొప్పున అందిస్తోంది. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన సర్పున్నిసాకు ఉన్న ఐదుగురు పిల్లలకు గాను మొత్తం రూ.65 వేలు ఆమె ఖాతాలో జమ అయ్యాయి. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కలిసి,సర్పున్నిసా కృతజ్ఞతలు తెలిపారు.


