ప్రజా సమస్యల పరిష్కారం, విద్యాభివృద్ధి, సామాజిక సేవలే తన జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్న బొద్దపు బంగార్రాజు గత 8 నెలలుగా పున్నమి రిపోర్టర్గా సేవలందిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం మండలం, శోంఠ్యం గ్రామానికి చెందిన ఆయన 10వ తరగతి విద్యార్హతతో ప్రస్తుతం డైలీ లేబర్గా పనిచేస్తూనే ప్రజా సేవలో చురుకుగా కొనసాగుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ చైర్మన్గా పదేళ్లపాటు విశిష్ట సేవలు అందించిన ఆయన, అనేక స్వచ్ఛంద సంస్థలను పాఠశాలలకు అనుసంధానం చేసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేశారు. అలాగే **ప్రజా సంకల్ప వేదిక (NGO)**లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అనంతరం విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కేజీబీవీ ఆనందపురం పాఠశాలలో కో-ఆప్షన్ మెంబర్గా సేవలందిస్తున్నారు.
పున్నమి న్యూస్ను ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి చేర్చి ప్రజలకు నిష్పాక్షికమైన వార్తలను అందించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.


