Tuesday, 4 August 2026
  • Home  
  • ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. ‘ప్రజా దర్బార్’కు విశేష స్పందన!
- అన్నమయ్య

ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. ‘ప్రజా దర్బార్’కు విశేష స్పందన!

-రాఘవరాజుపురం పార్టీ ఆఫీస్‌లో అర్జీలు స్వీకరించిన ‘కూడా’ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి -అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశం – ప్రతి వారం వినతుల స్వీకరణ.. ప్రజలకు మరింత చేరువగా కూటమి రైల్వే కోడూరు, జూన్ 13: ఎల్లో సింగం ప్రతినిధి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ‘కూడా’ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని రాఘవరాజుపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ప్రజల సమస్యల పరిష్కారార్థం ప్రత్యేకంగా నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి నియోజకవర్గవ్యాప్తంగా అశేష స్పందన లభించింది. -వెల్లువెత్తిన అర్జీలు – ఓర్పుగా విన్న నేత: నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి సామాన్య ప్రజలు, బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై ‘కూడా’ చైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యంగా గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధి, కొత్త పింఛన్ల మంజూరు, రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు, తాగునీటి ఎద్దడి వంటి పలు అంశాలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. బాధితులు చెప్పిన ప్రతి సమస్యను ముక్కా రూపానందరెడ్డి అత్యంత ఓర్పుతో అడిగి తెలుసుకున్నారు. కొన్ని తక్షణ సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -నిరంతరం ప్రజల సేవలోనే.. ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో అండగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. “ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కేవలం వినతులు స్వీకరించడమే కాకుండా వాటిని పరిష్కరించే దిశగా పక్కాగా కృషి చేస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువవుతాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అనుబంధ పార్టీల ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.

-రాఘవరాజుపురం పార్టీ ఆఫీస్‌లో అర్జీలు స్వీకరించిన ‘కూడా’ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి

-అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశం

– ప్రతి వారం వినతుల స్వీకరణ.. ప్రజలకు మరింత చేరువగా కూటమి

రైల్వే కోడూరు, జూన్ 13: ఎల్లో సింగం ప్రతినిధి

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, ‘కూడా’ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి స్పష్టం చేశారు. మండల పరిధిలోని రాఘవరాజుపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ప్రజల సమస్యల పరిష్కారార్థం ప్రత్యేకంగా నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి నియోజకవర్గవ్యాప్తంగా అశేష స్పందన లభించింది.

-వెల్లువెత్తిన అర్జీలు – ఓర్పుగా విన్న నేత:

నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి సామాన్య ప్రజలు, బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై ‘కూడా’ చైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యంగా గ్రామాల్లో అంతర్గత రహదారుల అభివృద్ధి, కొత్త పింఛన్ల మంజూరు, రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు, తాగునీటి ఎద్దడి వంటి పలు అంశాలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. బాధితులు చెప్పిన ప్రతి సమస్యను ముక్కా రూపానందరెడ్డి అత్యంత ఓర్పుతో అడిగి తెలుసుకున్నారు. కొన్ని తక్షణ సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

-నిరంతరం ప్రజల సేవలోనే..

ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో అండగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. “ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. కేవలం వినతులు స్వీకరించడమే కాకుండా వాటిని పరిష్కరించే దిశగా పక్కాగా కృషి చేస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువవుతాం” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అనుబంధ పార్టీల ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో అర్జీదారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.