శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.
గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు.


