పున్నమి న్యూస్
నాయుడుపేట రూరల్
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు క్రాస్రోడ్డులోని కిన్నెర్ 45 హోటల్ వద్ద శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో రోడ్డు పక్కన ఆగి ఉన్న సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ పాల వ్యాన్ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


