దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఆగస్టు 7న లెక్కించారు. ఈ లెక్కింపులో మొత్తం రూ.28,99,249 ఆదాయం సమకూరింది. గత ఏడాది హుండీ ద్వారా రూ.24,68,691లు రాగా, ఈ ఏడాది రూ.4,30,558 ఆదాయం పెరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, చైర్మన్ వేమూరి ముసలయ్య, పర్యవేక్షణాధికారి ఏ.వి.శ్రీనివాసులు రెడ్డి, జొన్నవాడ శ్రీ మల్లిఖార్జున కామాక్షితాయి దేవస్థానం ఈఓ, రిటైర్డ్ బ్యాంకు సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది, దేవస్థాన సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. భక్తుల విశ్వాసంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరగడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి హుండీకి భారీ ఆదాయం
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఆగస్టు 7న లెక్కించారు. ఈ లెక్కింపులో మొత్తం రూ.28,99,249 ఆదాయం సమకూరింది. గత ఏడాది హుండీ ద్వారా రూ.24,68,691లు రాగా, ఈ ఏడాది రూ.4,30,558 ఆదాయం పెరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, చైర్మన్ వేమూరి ముసలయ్య, పర్యవేక్షణాధికారి ఏ.వి.శ్రీనివాసులు రెడ్డి, జొన్నవాడ శ్రీ మల్లిఖార్జున కామాక్షితాయి దేవస్థానం ఈఓ, రిటైర్డ్ బ్యాంకు సిబ్బంది, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సిబ్బంది, దేవస్థాన సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. భక్తుల విశ్వాసంతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరగడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

