పున్నమి ప్రతినిధి. తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామసచివాలయంలో శుక్రవారం తిరుచానూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మౌనిక ముని శేఖర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు స్వచ్ఛ భారత్ విజయ వంతం చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రoగా ఉంచుకుంటే ప్రతివక్కరు ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు.ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అవుతుందని కావున ప్రతి ఒక్కరూ తమతమ కుటుంబాలు ఆవరణలో దోమలు చేరకుండా పెట్టుకోవాలన్నారు
అనంతరం సచివాలయంలో మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో
పంచాయతీ సెక్రటరీ రవికుమార్ టిడిపినాయకులుబాబురాయల్ ,ప్రహ్లాద రెడ్డి,సుధాకర్,ముని రెడ్డి,శ్రీనురాయల్,శంకర్, సునీల్ రాయల్,మిథున్
గ్రామస్తులు పాల్గొన్నారు


