Monday, 20 April 2026
  • Home  
  • తంగేళ్లపాలెం సొసైటీ ప్రగతి పథం-పెట్రోల్ బంకు నిర్మాణానికి భూమి పూజ
- తిరుపతి

తంగేళ్లపాలెం సొసైటీ ప్రగతి పథం-పెట్రోల్ బంకు నిర్మాణానికి భూమి పూజ

తొట్టంబేడు, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( తొట్టంబేడు మండల పరిధిలోని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో వ్యాపార విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించ తలపెట్టిన పెట్రోల్ బంకు నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావెళ్ళ మునిరాజనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు కేవలం రుణాలకే పరిమితం కాకుండా, ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు చేపట్టడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తంగేళ్లపాలెం సింగల్ విండో బ్యాంక్ చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి చలపతినాయుడు, గాలి మురళినాయుడు, బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్, చిల్లకూరు బాలసుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, చందు, సుబ్రహ్మణ్యం, విజయ్, వెంకటేష్, రాజ, బ్యాంకు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తొట్టంబేడు, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( తొట్టంబేడు మండల పరిధిలోని తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో వ్యాపార విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించ తలపెట్టిన పెట్రోల్ బంకు నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల అధ్యక్షుడు రావెళ్ళ మునిరాజనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు కేవలం రుణాలకే పరిమితం కాకుండా, ఇలాంటి వాణిజ్య కార్యకలాపాలు చేపట్టడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తంగేళ్లపాలెం సింగల్ విండో బ్యాంక్ చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి చలపతినాయుడు, గాలి మురళినాయుడు, బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్, చిల్లకూరు బాలసుబ్రమణ్యం, వెంకటేశ్వర్లు, చందు, సుబ్రహ్మణ్యం, విజయ్, వెంకటేష్, రాజ, బ్యాంకు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.