శ్రీ కాళహస్తి, మే 30, (పున్నమి న్యూస్) : పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో గల సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ‘చిల్డ్రన్ చెస్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి చెస్ శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి. శ్యాం ప్రసాద్, కార్యదర్శి కె.ఎస్.బి. సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) జయసారధి, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ త్రివేణి, సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ప్రిన్సిపాల్ లలితమ్మ, ప్రముఖులు ఠాగూర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గత 25 సంవత్సరాలుగా పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచి, వారిని జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్న తరుణంలో, వారి ఏకాగ్రతను మళ్లించడానికి చెస్ ఒక అద్భుతమైన సాధనమన్నారు. చదరంగం కేవలం ఆట మాత్రమే కాదని, ఇది మెదడుకు మంచి వ్యాయామమని పేర్కొన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు చెస్ ఆడటం వల్ల జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన (లాజిక్), సహనం పెరుగుతాయని, మెదడు చురుగ్గా పనిచేసి భవిష్యత్తులో మతిమరుపు వంటి సమస్యలు రావని వక్తలు వివరించారు. చిన్నారులు వేసవి సెలవులను ఇలా సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమన్నారు.అనంతరం శిబిరంలో ప్రతిభ కనబరిచి మొదటి పది స్థానాల్లో నిలిచిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శిక్షణలో పాల్గొన్న మిగతా చిన్నారులందరికీ ప్రోత్సాహక (కన్సోలేషన్) బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ ఎం. లక్ష్మీనారాయణ, ఆర్గనైజర్ కె. సురేష్ బాబు, గౌరవ అధ్యక్షుడు భక్తవత్సలం, సంస్థ ప్రతినిధి వి. హేమకుమార్ మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిన్నారుల్లో మేధోశక్తిని పెంపొందించేదే చదరంగం
శ్రీ కాళహస్తి, మే 30, (పున్నమి న్యూస్) : పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో గల సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ‘చిల్డ్రన్ చెస్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి చెస్ శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి. శ్యాం ప్రసాద్, కార్యదర్శి కె.ఎస్.బి. సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) జయసారధి, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ త్రివేణి, సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ప్రిన్సిపాల్ లలితమ్మ, ప్రముఖులు ఠాగూర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. గత 25 సంవత్సరాలుగా పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచి, వారిని జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్న తరుణంలో, వారి ఏకాగ్రతను మళ్లించడానికి చెస్ ఒక అద్భుతమైన సాధనమన్నారు. చదరంగం కేవలం ఆట మాత్రమే కాదని, ఇది మెదడుకు మంచి వ్యాయామమని పేర్కొన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలు చెస్ ఆడటం వల్ల జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచన (లాజిక్), సహనం పెరుగుతాయని, మెదడు చురుగ్గా పనిచేసి భవిష్యత్తులో మతిమరుపు వంటి సమస్యలు రావని వక్తలు వివరించారు. చిన్నారులు వేసవి సెలవులను ఇలా సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమన్నారు.అనంతరం శిబిరంలో ప్రతిభ కనబరిచి మొదటి పది స్థానాల్లో నిలిచిన విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. శిక్షణలో పాల్గొన్న మిగతా చిన్నారులందరికీ ప్రోత్సాహక (కన్సోలేషన్) బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ ఎం. లక్ష్మీనారాయణ, ఆర్గనైజర్ కె. సురేష్ బాబు, గౌరవ అధ్యక్షుడు భక్తవత్సలం, సంస్థ ప్రతినిధి వి. హేమకుమార్ మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

