చిట్వేల్, సెప్టెంబర్ 2: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం , చిట్వేల్–రాపూర్ క్రాస్రోడ్డులో బొప్పాయి కూలీలకు పోలీసులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిట్వేల్ ఎస్సై వినోద్కుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, నాగేశ్వరరావు కార్యక్రమం నిర్వహించారు. కూలీలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. అలాగే పికప్ వ్యాన్లపై కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరమని, వాహనం టాప్పై ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవద్దని కూలీలకు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.

చిట్వేల్ : బొప్పాయి కూలీలకు పోలీసుల రోడ్డు భద్రతా అవగాహన
చిట్వేల్, సెప్టెంబర్ 2: తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం , చిట్వేల్–రాపూర్ క్రాస్రోడ్డులో బొప్పాయి కూలీలకు పోలీసులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చిట్వేల్ ఎస్సై వినోద్కుమార్ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుళ్లు నరసింహులు, నాగేశ్వరరావు కార్యక్రమం నిర్వహించారు. కూలీలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్, బాల్యవివాహాలు, మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. అలాగే పికప్ వ్యాన్లపై కూర్చొని ప్రయాణించడం ప్రమాదకరమని, వాహనం టాప్పై ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోవద్దని కూలీలకు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.

