శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ కేంద్ర కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఆహ్వానం అందింది. శనివారం నాడు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రిని బీజేపీ నాయకులు కోలా ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ప్రాశిస్త్యాన్ని మంత్రికి కోలా ఆనంద్ వివరించి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తూ ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. లోకకళ్యాణార్థం జరిగే ఈ పవిత్ర కార్యక్రమాలకు హాజరై భోళాశంకరుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అందుకు మంత్రి శ్రీనివాస వర్మ సానుకూలంగా స్పందిస్తూ, స్వామివారి సేవలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రప్ప, సుబ్రహ్మణ్యం రెడ్డి, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసిన- కోలా ఆనంద్
శ్రీ కాళహస్తి, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ కేంద్ర కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఆహ్వానం అందింది. శనివారం నాడు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్రమంత్రిని బీజేపీ నాయకులు కోలా ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ప్రాశిస్త్యాన్ని మంత్రికి కోలా ఆనంద్ వివరించి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తూ ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. లోకకళ్యాణార్థం జరిగే ఈ పవిత్ర కార్యక్రమాలకు హాజరై భోళాశంకరుని కృపకు పాత్రులు కావాలని కోరారు. అందుకు మంత్రి శ్రీనివాస వర్మ సానుకూలంగా స్పందిస్తూ, స్వామివారి సేవలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రప్ప, సుబ్రహ్మణ్యం రెడ్డి, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.

