నందిగామలోని రైతుపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు యండ్రారెడ్డి శ్రీనివాసరావు అద్దె ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు బీరువా పగలగొట్టి దాదాపు రూ. కోటి విలువైన 692 గ్రాముల బంగారం, రూ. 6 లక్షల నగదు దోచుకెళ్లారు
ఘటన:- శ్రీనివాసరావు సోమవారం రాత్రి కొత్త ఇంటికి వెళ్లగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి.
దొంగల తెలివి:- ఆధారాలు దొరకకుండా దొంగలు బీరువాలో నీళ్లు పోసి, ఇల్లంతా కారం చల్లారు.
పోలీస్ దర్యాప్తు:- సీసీ కెమెరాల ఆధారంగా అర్థరాత్రి ఇద్దరు లేదా ముగ్గురు దుండగులు స్కూటీపై వచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి.
ప్రత్యేక బృందాలు:- నిందితులను పట్టుకోవడానికి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


