తొట్టంబేడు, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం ఎగువ కొణతనేరి గ్రామానికి చెందిన యలకాటి వెంకటయ్య నాయుడు మృతి పట్ల టిడిపి నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండె నొప్పితో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, సీనియర్ నాయకుడు గాలి మురళి నాయుడు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. వెంకటయ్య నాయుడు పార్టీకి అండగా నిలిచిన నాయకుడని కొనియాడుతూ, ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొని నివాళులర్పించారు.

ఎగువ కొణతనేరి వాసి మృతి పట్ల టిడిపి నేతల సంతాపం
తొట్టంబేడు, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం ఎగువ కొణతనేరి గ్రామానికి చెందిన యలకాటి వెంకటయ్య నాయుడు మృతి పట్ల టిడిపి నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండె నొప్పితో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, సీనియర్ నాయకుడు గాలి మురళి నాయుడు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. వెంకటయ్య నాయుడు పార్టీకి అండగా నిలిచిన నాయకుడని కొనియాడుతూ, ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, గ్రామస్తులు పాల్గొని నివాళులర్పించారు.

