ఒడిశాకు చెందిన 17 ఏళ్ల గిరిజన బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఉత్తరప్రదేశ్కు తరలించి, అక్కడ విక్రయించి రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఒక వ్యక్తికి, అనంతరం మరొకరికి ఆమెను అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాలంలో పలువురు ఆమెపై అత్యాచారాలకు పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. చివరకు స్థానిక న్యాయవాది సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని స్వస్థలానికి చేరుకుంది. ఈ ఘటన వెనుక అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉద్యోగం పేరుతో మోసం.. గిరిజన బాలికను విక్రయించి రెండేళ్ల పాటు లైంగిక దాడులు
ఒడిశాకు చెందిన 17 ఏళ్ల గిరిజన బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఉత్తరప్రదేశ్కు తరలించి, అక్కడ విక్రయించి రెండేళ్ల పాటు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఒక వ్యక్తికి, అనంతరం మరొకరికి ఆమెను అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాలంలో పలువురు ఆమెపై అత్యాచారాలకు పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. చివరకు స్థానిక న్యాయవాది సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని స్వస్థలానికి చేరుకుంది. ఈ ఘటన వెనుక అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

