పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం, ప్లాట్లు, ఖరీదైన వాహనాలు తీసుకొని మోసం చేసిన అషు రెడ్డి
పున్నమి న్యూస్ ప్రతినిధి
26 ఏప్రిల్ 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
అషు రెడ్డి మరియు ఆమె కుటుంబ సభ్యుల మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు
హైదరాబాద్ – షేక్పేట్ ప్రాంతానికి చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వై.వి. ధర్మేంద్ర లండన్లో సాప్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తుండగా, 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో పరిచయం పెంచుకున్న అషు రెడ్డి
పరిచయమైన కొన్ని రోజులకే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని దగ్గరైన అషు రెడ్డి
ఆ తర్వాత ధర్మేంద్రతో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామంటూ పురోహితుడిని పిలిపించి హడావుడి చేసిన అషు రెడ్డి కుటుంబసభ్యులు
అప్పటి నుండి అషు రెడ్డి, తన కొడుకు ధర్మేంద్ర దగ్గర సుమారు రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం తీసుకుందని, ఫ్లాట్లు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయించుకుందని, ఆమె సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకుందని తెలిపిన తండ్రి సత్యనారాయణ
ఆ తర్వాత ముఖం చాటేసి, తన కొడుకు పెళ్లికి అడిగినా నిరాకరించిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి సత్యనారాయణ
దీంతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, FIR ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు




