అనంతపురం జిల్లా, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ ): రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ గారిని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, దళిత రత్న అవార్డు గ్రహీత మాన్యశ్రీ దండు వీరయ్య మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దళితుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు, హక్కుల పరిరక్షణపై వివరణాత్మకంగా చర్చించారు. దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చైర్మన్ జవహర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.



