వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి, జూలై 16 ( పున్నమి ప్రతినిధి ): మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి వర్ధంతి సందర్భంగా అనపర్తి జీ.బి.ఆర్. కళాశాల ప్రాంగణంలో గురువారం ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి తనయులు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు, రాష్ట్ర సర్పంచుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు పడాల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి ప్రజలకు అందించిన విశిష్ట సేవలను నాయకులు స్మరించుకుని, ఆయన ఆశయాలను కొనసాగించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.



