ఖమ్మం, ఆగస్టు
(పున్నమి న్యూస్ ప్రతి నిధి )
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం
న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు ఆత్మహత్యాయత్నం ఘటనపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువకుడి ప్రాణాపాయ స్థితిపై ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో వేణు పూర్తిగా కోలుకోకముందే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. వేణుకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వేణు ఘటనపై జిల్లాలోని ముగ్గురు మంత్రులు మౌనం ఎందుకు..? – బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రశ్న
ఖమ్మం, ఆగస్టు (పున్నమి న్యూస్ ప్రతి నిధి ) ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు ఆత్మహత్యాయత్నం ఘటనపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువకుడి ప్రాణాపాయ స్థితిపై ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో వేణు పూర్తిగా కోలుకోకముందే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. వేణుకు అత్యుత్తమ వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

