ముద్దనూరు మండల పరిధిలో నమోదైన వివిధ కేసులకు సంబంధించి శని వారం జమ్మలమడుగు కోర్టులో నిర్వహించిన లోక్అదాలత్లో 23 కేసులు పరిష్కారమైనట్లు సీఐ నగేష్ బాబు తెలిపారు. అదేవిధంగా 2,500 టౌన్ న్యూసెన్స్కి సంబంధించిన కేసులను కూడా లోక్అదాలత్ ద్వారా పరిష్కరిం చినట్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్అదాలత్ ద్వారా సత్వరంగా పరిష్కరించుకునే అవకాశం ఉంద న్నారు. దీనివల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసు ల పరిష్కారంలో జాప్యం తగ్గుతుందని తెలిపారు. చిన్నపాటి వివాదాలు, రాజీ కి అవకాశం ఉన్న కేసుల్లో సంబంధిత కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు వచ్చి లోక్అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీఐ నగే ష్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.
లోక్అదాలత్లో కేసులకు పరిష్కారం
ముద్దనూరు మండల పరిధిలో నమోదైన వివిధ కేసులకు సంబంధించి శని వారం జమ్మలమడుగు కోర్టులో నిర్వహించిన లోక్అదాలత్లో 23 కేసులు పరిష్కారమైనట్లు సీఐ నగేష్ బాబు తెలిపారు. అదేవిధంగా 2,500 టౌన్ న్యూసెన్స్కి సంబంధించిన కేసులను కూడా లోక్అదాలత్ ద్వారా పరిష్కరిం చినట్లు పేర్కొన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్అదాలత్ ద్వారా సత్వరంగా పరిష్కరించుకునే అవకాశం ఉంద న్నారు. దీనివల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు కేసు ల పరిష్కారంలో జాప్యం తగ్గుతుందని తెలిపారు. చిన్నపాటి వివాదాలు, రాజీ కి అవకాశం ఉన్న కేసుల్లో సంబంధిత కక్షిదారులు పరస్పర అవగాహనతో ముందుకు వచ్చి లోక్అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీఐ నగే ష్ బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు కానిస్టేబుల్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.

