తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) రాజమహేంద్రవరం : ద్వారపూడి జంక్షన్ వద్ద గల ఫ్లైవర్ సమీపంలో శనివారం మూడు కార్లు ఒకదానిని వెనుక మరొకటి ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న మినీ జేసీబీని లోడు జీపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అనంతరం వెనుక నుంచి వస్తున్న మరో కారు కూడా ప్రమాదానికి గురై వరుసగా వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కార్లు ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం కారణంగా కొద్దిసేపు వాహనాల రాకపోకలు నెమ్మదించాయి.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం ఎంతమేరకు జరిగిందనే వివరాలు అధికారులు పరిశీలిస్తున్నారు.
ఫ్లైవర్ సమీపంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలని స్థానికులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముందున్న వాహనానికి తగినంత దూరం పాటిస్తూ, వేగాన్ని నియంత్రించుకోవాలని కోరుతున్నారు. వరుసగా వాహనాలు ఢీకొన్న ఘటన నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Uploaded Video:

