ఖమ్మంభారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత కోసం అమలు చేస్తున్న పలు పథకాలను ఆమె వివరించారు.
మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శ్రీరామనేని మణి తెలిపారు. ఖమ్మం జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా పున్నమి దినపత్రిక యాజమాన్యానికి, పాఠకులకు, ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలంతా ఐక్యతతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఆకాంక్షించారు.


