మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 21న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ రచయిత, విజయనగరానికి చెందిన శ్రీ జి.ఎస్. చలం ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు పి.ఆర్.ఆర్ & వి.ఎస్ ప్రభుత్వ కళాశాల, విడవలూరులో కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు డి.కె. ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం), నెల్లూరులో మరో కార్యక్రమం నిర్వహించనున్నారు.
గురజాడ సాహిత్యం, సామాజిక చైతన్యం, సమాజ సంస్కరణకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు. “మహాకవి గురజాడ స్ఫూర్తితో మెరుగైన సమాజం కోసం” అనే సందేశంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

