మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఐదు రోజుల భారత పర్యటన కోసం బోధ్ గయాకు చేరుకున్నారు. ఆయనకు బీహార్ గవర్నర్, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై వాణిజ్యం, సరిహద్దు భద్రత, రక్షణ, కనెక్టివిటీ అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అనంతరం ముంబైలో వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

భారత్ పర్యటనకు మయన్మార్ అధ్యక్షుడు
మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఐదు రోజుల భారత పర్యటన కోసం బోధ్ గయాకు చేరుకున్నారు. ఆయనకు బీహార్ గవర్నర్, రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై వాణిజ్యం, సరిహద్దు భద్రత, రక్షణ, కనెక్టివిటీ అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా అధికారులు తెలిపారు. అనంతరం ముంబైలో వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

