శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అధికారులు విధించిన బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై కృత్తివెన్ను ఎస్ఐ పైడి బాబు కఠిన చర్యలు తీసుకున్నారు. గతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన నేపథ్యంలో సంబంధిత వ్యక్తిని బైండోవర్ చేసి, నిర్దిష్ట కాలం పాటు ఎటువంటి వివాదాలకు పాల్పడకూడదని ఆదేశించారు. అయితే ఆ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు కేసును పరిశీలించి రూ.1 లక్ష జరిమానా విధించినట్లు కృత్తివెన్ను ఎస్ ఐ తెలిపారు. ఇటువంటి చర్యలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారికి హెచ్చరికగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

బైండోవర్ నిబంధనలు బేఖాతరు…భారీ జరిమాన విధించిన అధికారులు
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అధికారులు విధించిన బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై కృత్తివెన్ను ఎస్ఐ పైడి బాబు కఠిన చర్యలు తీసుకున్నారు. గతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడిన నేపథ్యంలో సంబంధిత వ్యక్తిని బైండోవర్ చేసి, నిర్దిష్ట కాలం పాటు ఎటువంటి వివాదాలకు పాల్పడకూడదని ఆదేశించారు. అయితే ఆ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు కేసును పరిశీలించి రూ.1 లక్ష జరిమానా విధించినట్లు కృత్తివెన్ను ఎస్ ఐ తెలిపారు. ఇటువంటి చర్యలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారికి హెచ్చరికగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

