*జీడీఎస్ ఉద్యోగుల* *సమస్యల* *పరిష్కారానికి ఎంపీ* *రఘునందన్రావును* *కలిసిన* *బీజీడీకేఎస్* *యూనియన్* *నాయకులు*
తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగుల (జీడీఎస్) సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజీడీకేఎస్ యూనియన్ నాయకులు ఎంపీ మాధవనేని రఘునందన్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని భారం, అదనపు బాధ్యతలు, ఉద్యోగ సమస్యలు, వేతనాలు మరియు ఇతర సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యలను కేంద్ర తపాలా శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజీడీకేఎస్ యూనియన్ నాయకులు, జీడీఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


