ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూన్ 12: స్థానిక జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో నెలకొన్న విద్యుత్ సమస్యను ట్రాన్స్కో అధికారులు పరిష్కరించారు. పాఠశాలలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా వేసవి సెలవులకు ముందే సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి జిల్లా కలెక్టర్ దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్ శుక్రవారం పాఠశాలను సందర్శించి, సొంత నిధులతో మరమ్మతులు చేపట్టించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వసంతకుమారి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు శేషయ్య, రాజశేఖర్ .జేఎల్ఎంలు.పాల్గొన్నారు.

జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో విద్యుత్ సమస్య పరిష్కారం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూన్ 12: స్థానిక జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో నెలకొన్న విద్యుత్ సమస్యను ట్రాన్స్కో అధికారులు పరిష్కరించారు. పాఠశాలలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా వేసవి సెలవులకు ముందే సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను ప్రధానోపాధ్యాయురాలు వసంతకుమారి జిల్లా కలెక్టర్ దృష్టికి రాతపూర్వకంగా తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ట్రాన్స్కో ఏఈ అనిల్ కుమార్ శుక్రవారం పాఠశాలను సందర్శించి, సొంత నిధులతో మరమ్మతులు చేపట్టించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా వసంతకుమారి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు శేషయ్య, రాజశేఖర్ .జేఎల్ఎంలు.పాల్గొన్నారు.

