వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో పరివారం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము రాజరాజేశ్వర స్వామి కళ్యాణం మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బుధవారం రోజు ఘనంగా వైభవంగా నిర్వహించారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయలలో ప్రతి సంవత్సరము పటేండ్ల (చాదల్) వంశస్తుల ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి కళ్యాణం తో పాటుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలైన పెర్కిట్, మామిడిపల్లి, నందిపేట్ మండల్ నుండి మరియు బాల్కొండ, నిజాంబాద్ మొదలైన ప్రాంతాల నుండి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రెండు రోజులుగా యజ్ఞలు నిర్వహించి పూజ కార్యక్రమాలు చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించిన చాదల్ వంశస్తులైన పి ఆర్ టి యు నాయకులు సి.వీ. నరసింహారావు పటేల్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పూర్వీకుల నుండి ఎంతో మహిమగల దైవమని, భక్తితో మొక్కిన భక్తుల యొక్క కష్టాలను ఇక్కడ దేవుడు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటేండ్ల పరివార్ సభ్యులు, సత్యనారాయణ పటేల్, సుదర్శన్ పటేల్, రాజేందర్ పటేల్, భూపతిరావు పటేల్, ప్రభాకర్ రావు పటేల్ ,శ్రీనివాస్ పటేల్, వినోద్ పటేల్, విప్లవ పటేల్, శశాంక్ పటేల్, నర్సింగ్ పటేల్, కృష్ణ పటేల్ , అభినవ్ అభినయ్ పటేల్స్, మొదలైన వారు పాల్గొన్నారు.

ఘనంగా కళ్యాణోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్టాపన
వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో పరివారం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము రాజరాజేశ్వర స్వామి కళ్యాణం మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బుధవారం రోజు ఘనంగా వైభవంగా నిర్వహించారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయలలో ప్రతి సంవత్సరము పటేండ్ల (చాదల్) వంశస్తుల ఆధ్వర్యంలో ఈ కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి కళ్యాణం తో పాటుగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలైన పెర్కిట్, మామిడిపల్లి, నందిపేట్ మండల్ నుండి మరియు బాల్కొండ, నిజాంబాద్ మొదలైన ప్రాంతాల నుండి భక్తులు వందల సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రెండు రోజులుగా యజ్ఞలు నిర్వహించి పూజ కార్యక్రమాలు చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించిన చాదల్ వంశస్తులైన పి ఆర్ టి యు నాయకులు సి.వీ. నరసింహారావు పటేల్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పూర్వీకుల నుండి ఎంతో మహిమగల దైవమని, భక్తితో మొక్కిన భక్తుల యొక్క కష్టాలను ఇక్కడ దేవుడు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటేండ్ల పరివార్ సభ్యులు, సత్యనారాయణ పటేల్, సుదర్శన్ పటేల్, రాజేందర్ పటేల్, భూపతిరావు పటేల్, ప్రభాకర్ రావు పటేల్ ,శ్రీనివాస్ పటేల్, వినోద్ పటేల్, విప్లవ పటేల్, శశాంక్ పటేల్, నర్సింగ్ పటేల్, కృష్ణ పటేల్ , అభినవ్ అభినయ్ పటేల్స్, మొదలైన వారు పాల్గొన్నారు.

