అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాశిపట్నం పంచాయతీ మండపర్తి గ్రామంలో గిరి బాల నేస్తం ఆధ్వర్యంలో క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్ లో మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో పిల్లలు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు పురాణ కాలం నుండి చేసే ప్రతి పనిలో అన్ని విజ్ఞాలు తొలగిపోవాలని ముందుగా వినాయకుడిని పూజిస్తాము చిన్న పసుపు ముద్ద రూపంలో వినాయకుడిని చేసి పూజిస్తాము రాను రాను రకరకాల రంగులతో భారీ వినాయక విగ్రహాలు పెట్టడం ఆర్టిఫిషియల్ రంగులు భూమిలో కరగలేని మిశ్రమ వస్తువులు , పదార్థాలను ఉపయోగించి బొమ్మలు తయారుచేయడం వల్ల పర్యావరణ కలుషితమవుతుంది ఆ బొమ్మలు నిమజ్జనం చేసిన నీటిలో కరగకపోవడం ఆర్టిఫిషియల్ రంగులు వల్ల నీళ్లు కలుషితం అవ్వడం ఆ నీళ్లు త్రాగే ప్రజలు అనారోగ్య పాలవడం పంట పొలాలకు ఆ నీళ్లు వెళ్ళిన పంటలు సరిగ్గా పండగ పోవడం దెబ్బతినడం జరుగుతుంది భవిష్యత్తులో పిల్లల ద్వారా ప్రతి సందర్భం పర్యావరణానికి సమాజంగా నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో అది పిల్లల నుంచి చిన్నప్పుడు నుండి మంచి మార్పు మొదలవ్వాలన్న మంచి ఉద్దేశంతో గిరి బాల నేస్తం క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించింది ఈ కార్యక్రమంలో పిల్లలు స్వయంగా చేసిన మట్టి బొమ్మలతో గ్రామంలో ర్యాలీలు చేస్తూ నినాదాలు ఇచ్చి ప్రజలను అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్ టీచర్ అశ్విని గిరిజన సంఘం నాయకులు దేముడు . గ్రామ ప్రజలు పాల్గొన్నారు



