ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాం ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏపీలో విస్తారంగా భారీ వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాం ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

