ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ విశిష్ట సేవలకు గుర్తింపు లభించింది. ఆయన విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ చేతుల మీదుగా రమేష్ కుమార్ అవార్డును అందుకున్నారు. ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తున్నందుకు ఆయనను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు. అవార్డు అందుకోవడం పట్ల రమేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులోనూ ప్రయాణికుల సౌకర్యం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.
ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్కు విశిష్ట సేవా అవార్డు
ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ విశిష్ట సేవలకు గుర్తింపు లభించింది. ఆయన విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ చేతుల మీదుగా రమేష్ కుమార్ అవార్డును అందుకున్నారు. ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కృషి చేస్తున్నందుకు ఆయనను పలువురు అధికారులు, సిబ్బంది అభినందించారు. అవార్డు అందుకోవడం పట్ల రమేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులోనూ ప్రయాణికుల సౌకర్యం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు.

