Tuesday, 9 June 2026
  • Home  
  • ఇంధన ధరలు తగ్గించాలంటూ ఆత్మకూరులో సీపీఎం రాస్తారోకో
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంధన ధరలు తగ్గించాలంటూ ఆత్మకూరులో సీపీఎం రాస్తారోకో

సోమశిల రోడ్డు సెంటర్‌లో గంటపాటు నిరసన.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపుకు డిమాండ్ ఆత్మకూరు, జూన్ 9 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి): పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మకూరు పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని సోమశిల రోడ్డు సెంటర్‌లో సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు నాయకత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవనం రోజురోజుకు భారంగా మారుతోందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని, రవాణా వ్యయాలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.రాస్తారోకో కారణంగా సోమశిల రోడ్డు సెంటర్‌లో దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై జంపాని కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరసనను విరమించాలని కోరడంతో సీపీఎం నాయకులు తమ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు డేవిడ్ రాజు, సందాని మాట్లాడుతూ దేశంలో ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకు పెరుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోందని, దాని ప్రభావం రైతులు, కార్మికులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులపై పడుతోందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుండగా, ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని విమర్శించారు.వంటగ్యాస్ ధరలు కూడా సామాన్య కుటుంబాలకు అందని స్థాయికి చేరుకున్నాయని, గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ధరల పెంపు వల్ల మధ్యతరగతి, పేద వర్గాల జీవనం సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం పోరాడుతుందని, ఇంధన ధరల తగ్గింపు వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు శివప్రసాద్, సీపీఎం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, సీఐటీయూ ఆత్మకూరు అధ్యక్షుడు నాగయ్య, రమణయ్య, పద్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సోమశిల రోడ్డు సెంటర్‌లో గంటపాటు నిరసన.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపుకు డిమాండ్

ఆత్మకూరు, జూన్ 9 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మకూరు పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలోని సోమశిల రోడ్డు సెంటర్‌లో సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు నాయకత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవనం రోజురోజుకు భారంగా మారుతోందన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని, రవాణా వ్యయాలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.రాస్తారోకో కారణంగా సోమశిల రోడ్డు సెంటర్‌లో దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై జంపాని కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరసనను విరమించాలని కోరడంతో సీపీఎం నాయకులు తమ నిరసన కార్యక్రమాన్ని ముగించారు.

ఈ సందర్భంగా సీపీఎం నాయకులు డేవిడ్ రాజు, సందాని మాట్లాడుతూ దేశంలో ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకు పెరుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా రంగం తీవ్ర ప్రభావానికి గురవుతోందని, దాని ప్రభావం రైతులు, కార్మికులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులపై పడుతోందని తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుండగా, ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని విమర్శించారు.వంటగ్యాస్ ధరలు కూడా సామాన్య కుటుంబాలకు అందని స్థాయికి చేరుకున్నాయని, గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ధరల పెంపు వల్ల మధ్యతరగతి, పేద వర్గాల జీవనం సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఎం నిరంతరం పోరాడుతుందని, ఇంధన ధరల తగ్గింపు వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు శివప్రసాద్, సీపీఎం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని, సీఐటీయూ ఆత్మకూరు అధ్యక్షుడు నాగయ్య, రమణయ్య, పద్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.