ఆర్యవైశ్యుల రాజకీయ వాటా వారే సాధించాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఆర్యవైశ్యులు ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో జీవించే సమాజమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదరికం ఉన్నా గౌరవంగా జీవించడం వారి ప్రత్యేకతన్నారు. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, రోశయ్య సేవలను ప్రస్తావించారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే కార్పొరేషన్ పదవితో పాటు మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చామని తెలిపారు. రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటాను సాధించుకోవాలని, అందుకు సమైక్యంగా ఒక్కతాటిపై నడవాలని పిలుపునిచ్చారు.

