AP Corona Cases: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతుండటం ప్రజల్లో స్వల్ప ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. వేర్వేరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.Vaartha Telugu News
తాజా
తెలంగాణ
ఆంధ్ర
భారత్
ప్రపంచం
◆
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 22 జులై 2026
◆
Talliki vandanam funds: ఈ తేదీ లోపు తల్లికి వందనం డబ్బులు జమ
◆
Thalliki vandanam scheme: తల్లికి వందనం డబ్బులు పడలేదా? వెంటనే ఇలా చేయండి
◆
Weather updates: తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణం
◆
Talliki Vandanam scheme: తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదల
◆
Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు
◆
Rice Prices : భారీగా పెరిగిన బియ్యం ధరలు
◆
Corona Cases Hyderabad: హైదరాబాద్లో కరోనా కలకలం..వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ
◆
Sonia Gandhi: సోనియా గాంధీ రాకతో పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన రాహుల్, ప్రియాంక
◆
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టోకెన్ల జారీ రద్దు
◆
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 22 జులై 2026
◆
Talliki vandanam funds: ఈ తేదీ లోపు తల్లికి వందనం డబ్బులు జమ
◆
Thalliki vandanam scheme: తల్లికి వందనం డబ్బులు పడలేదా? వెంటనే ఇలా చేయండి
◆
Weather updates: తెలుగు రాష్ట్రాల్లో ముసురు వాతావరణం
◆
Talliki Vandanam scheme: తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదల
◆
Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు
◆
Rice Prices : భారీగా పెరిగిన బియ్యం ధరలు
◆
Corona Cases Hyderabad: హైదరాబాద్లో కరోనా కలకలం..వైరస్ లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ
◆
Sonia Gandhi: సోనియా గాంధీ రాకతో పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన రాహుల్, ప్రియాంక
◆
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టోకెన్ల జారీ రద్దు
హోమ్
లైవ్ టీవీ
Vaartha
E-Paper
స్టోరీస్
మెనూ
Home
నెల్లూరు
AP Corona Cases: ఏపీలో కరోనా అలర్ట్.. నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదుGeographic Reference
AP Corona Cases: ఏపీలో కరోనా అలర్ట్.. నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు
Edited by:
Sharanya
|
నెల్లూరు
|
19 Jul 2026 11:42 AM IST
|
2 mins read
Follow Us:
Google News
Daily Hunt
Share
ap covid cases nellore ntr districts
ap covid cases nellore ntr districts Infectious Diseases
FONT SIZE
A
A+
A++
GET APP
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతుండటం ప్రజల్లో స్వల్ప ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు కొత్త కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. వేర్వేరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
Read also: Visakhapatnam Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన కారు, నలుగురు మృతిMedical Literature & Resources
క్యాన్సర్, కిడ్నీ బాధితులైన చిన్నారులకు సోకిన వైరస్
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం గ్రామానికి చెందిన ఒక మూడేళ్ల బాలుడు క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో పుదుచ్చేరిలో చికిత్స పొందుతున్న ఆ బాలుడికి కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే, ఆ బాలుడి తల్లిదండ్రులకు, బంధువులకు పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చింది. మరో కేసులో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిధిలోని రోలపాడుకు చెందిన 13 ఏళ్ల బాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి (GGH)లో డయాలసిస్ చేయించుకుంటున్న ఆమెకు జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలు చేశారు. అందులో పాజిటివ్గా తేలడంతో వెంటనే ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలిక కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకలేదని తేలింది.రాష్ట్రంలో జూన్ 26 నుంచి జులై 16 మధ్య కాలంలో మొత్తం 12 కోవిడ్ కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల వారీగా చూస్తే కడపలో అత్యధికంగా 8 కేసులు రాగా.. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. మరణించిన వారంతా గతంలోనే మధుమేహం, బీపీ, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారేనని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని, ప్రజలు అనవసరంగా భయపడకుండా, మాస్కులు ధరిస్తూ అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని అధికారులు సూచించారు.



