*_అదును పదును చూసి పత్తి విత్తనాలు పెట్టుకోవాలి
మండల్ వ్యవసాయ అధికారి – దొడ్డిగార్ల బాలాజీ_*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 05
గుగులోత్ భావుసింగ్ నాయక్
రైతులు ఎవ్వరు కూడా తొందరపడి పత్తి విత్తనాలు పొడి దుక్కిలో పెట్టుకోవద్దు అలినోవా ప్రభావం బాగా వుంది వర్షాలు కొచం వెనకడవచ్చు రైతులు అదును పదును చీసి మాత్రమే విత్తనాలు పెట్టుకువాలి, భూమి చల్ల పడాలి అంటే 60 నుండి 100 mm వర్షం పడితేనే చల్ల బడుతుంది, మీకు నచ్చిన పత్తి విత్తనాలు తీసుకొని వచ్చి ఎకరాకు 3000 రూపాయల వరకు ఖర్చు చేసి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు పెడితే వర్షాలు రాకపోతే మొలకలు రావు రైతు నష్ట పోతారు, రెండో సారి మీకు మీకు నచ్చిన మంచి కంపినీ విత్తనాలు దొరకక పోవచ్చు, పత్తి విత్తనాలు జులై 15 వరకు పెట్టుకోవచ్చు, కొందరు రాతులు ఎకరాకు 50000 రూపాయలు పెట్టి కావులుకు తీసుకుంటున్నారు ముందుగా పత్తి వేసి రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవటానికి వెసులుబాటు అవుతుంది అని పొడి విత్తనాలు పెడదాము అని అనుకోవచ్చు ఈ సంవత్సరం అలినోవా ప్రభావం ఉండటం వలన వర్షాలు అనుకుంలించక పోవచ్చు అందుకని రైతులు ఎవ్వరు భూమి చల్ల బడకుండా పత్తి విత్తనాలు పెట్టవద్దు అని వ్యవసాయ శాఖ నుండి కోరుచున్నాము ఈ రోజు మలుపల్లి గ్రామం లో పత్తి విత్తనాలు పెడుతున్నారు అని మా దృష్టికి రావటం వలన పత్తి విత్తనాలు పెట్టవద్దు అని చెప్పటం జరిగింది ఈ కార్యక్రమం లో మండల్ వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ, కృష్ణ అర్జణరావు మరియు రైతులు పాల్గున్నారు


