చెన్నారావుపేట గ్రామంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన తాళ్ల యాకయ్య కరుణశ్రీ దంపతుల కుమారుడు తాళ్ల అజయ్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ వర్సిటీ ఛాన్సలర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు చైర్మన్ డా కృష్ణ ఎల్లా హాజరయ్యారు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రో. కుమార్ మేలగరం సమక్షంలో వారి చేతుల మీదుగా రోల్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ తెలంగాణ మూమెంట్ (1956-2014) అనేఅంశం మీద పరిశోధనకు గాను ఈ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ప్రయాణంలో సహకరించిన గురువులకు బంధు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ సాధించడం ద్వారా సామాజిక సేవ మరింత పెరిగిందని ఈ డాక్టరేట్ ని తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర త్యాగాలు చేసిన విద్యార్థి ఉద్యమకారులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

డాక్టరేట్ పట్టా అందుకున్న తాళ్ల అజయ్
చెన్నారావుపేట గ్రామంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన తాళ్ల యాకయ్య కరుణశ్రీ దంపతుల కుమారుడు తాళ్ల అజయ్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టా అందుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ వర్సిటీ ఛాన్సలర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా భారత్ బయోటిక్ వ్యవస్థాపకులు చైర్మన్ డా కృష్ణ ఎల్లా హాజరయ్యారు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రో. కుమార్ మేలగరం సమక్షంలో వారి చేతుల మీదుగా రోల్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ తెలంగాణ మూమెంట్ (1956-2014) అనేఅంశం మీద పరిశోధనకు గాను ఈ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ప్రయాణంలో సహకరించిన గురువులకు బంధు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరేట్ సాధించడం ద్వారా సామాజిక సేవ మరింత పెరిగిందని ఈ డాక్టరేట్ ని తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర త్యాగాలు చేసిన విద్యార్థి ఉద్యమకారులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

