ఖమ్మం నగరంలోని పెవీలియన్ గ్రౌండ్లో శ్రీ రక్ష హాస్పిటల్ అధినేత శ్రీ గోంగూర వెంకటేశ్వర్లు (డాక్టర్ జి.వి.) ఆధ్వర్యంలో నషాముక్త అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, కుటుంబాలు, సమాజంపై వాటి ప్రభావాన్ని వివరించారు. కార్యక్రమంలో ఖమ్మం నగర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ బంధం హనుమంతరావు, బ్రహ్మకుమారి సమాజం సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, శ్రీ రక్ష ఆరోగ్య యాత్ర సభ్యులు పాల్గొన్నారు.



