నెల్లూరు జిల్లా పొదలకూరులోని జామియా మర్కజ్ మసీదులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మసీదులో ముస్లిం మతపెద్ద ముస్తాక్ మదాని జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటారు. అనంతరం ముస్లిం పెద్దలు, యువకులు స్థానిక దేవాలయాన్ని సందర్శించి పూజారిని ఘనంగా సత్కరించారు. హిందూ, ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం ఈ ప్రాంతంలో మత సామరస్యానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలు,స్థానికంగా అందరినీ ఆకట్టుకున్నాయి.

పొదలకూరులో మత సామరస్యానికి ప్రతీకగా స్వాతంత్ర్య వేడుకలు
నెల్లూరు జిల్లా పొదలకూరులోని జామియా మర్కజ్ మసీదులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మసీదులో ముస్లిం మతపెద్ద ముస్తాక్ మదాని జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటారు. అనంతరం ముస్లిం పెద్దలు, యువకులు స్థానిక దేవాలయాన్ని సందర్శించి పూజారిని ఘనంగా సత్కరించారు. హిందూ, ముస్లిం సోదరులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం ఈ ప్రాంతంలో మత సామరస్యానికి గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలు,స్థానికంగా అందరినీ ఆకట్టుకున్నాయి.

