*డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను పరామర్శించిన బి ఆర్ పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బుర్రి సాగర్*
బహుజన ఉద్యమ నాయకుడు, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను బహుజన్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బుర్రి సాగర్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. గత 30 సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గంలో మలిదశ తెలంగాణ ఉద్యమం, బీసీ ఉద్యమం, బహుజన ఉద్యమంలో అనునిత్యం పోరాడే నాయకుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ అని అన్నారు. ఇటివల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన బీసీ మహాసభ ల కార్యక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో శ్రీనివాస్ కు తలకు మరియు కాలుకు గాయాలు కావడం జరిగిందని ఇలా జరగడం చాలా బాధాకరం అని అన్నారు. ఏది ఏమైనా డ్యాగల శ్రీనివాస్ తొందరగా కోలుకుని మళ్లీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన్ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల శ్రీకాంత్, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, జినుకల యాకయ్య ముదిరాజ్, తనుగుల సుధాకర్, మారపెల్లి రాజు, గొర్రె రాములు తదితరులు పాల్గొన్నారు


