శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ విజయవాడలో ఆత్మీయంగా కలిశారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి, మళయాళ యతీంద్రులచే స్థాపించబడిన ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అవినీతి వివాదాలు, అక్రమాల గురించి ముఖ్యమంత్రి స్వయంగా వాకబు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీవ్యాసాశ్రమం అవినీతిమయమైందని, దాని పూర్వవైభవం కోసం ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి కోలా ఆనంద్ విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

సి.యం.ని కలిసిన బీజేపీ నేత కోలా ఆనంద్-వ్యాసాశ్రమం పరిరక్షణపై వినతి
శ్రీ కాళహస్తి, జులై 29, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ విజయవాడలో ఆత్మీయంగా కలిశారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, స్థానిక రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి, మళయాళ యతీంద్రులచే స్థాపించబడిన ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అవినీతి వివాదాలు, అక్రమాల గురించి ముఖ్యమంత్రి స్వయంగా వాకబు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన శ్రీవ్యాసాశ్రమం అవినీతిమయమైందని, దాని పూర్వవైభవం కోసం ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి కోలా ఆనంద్ విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

