డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం మండల ఆంధ్ర తెలంగాణ రంగా రాధా చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శిగా ఆదిమూలం కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ అధ్యక్షులు పన్నస పూర్ణచంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి) సంతకం చేసిన నియామక పత్రాన్ని బుధవారం ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా ఆదిమూలం తనకు ఈ కీలకమైన బాధ్యతను అప్పగించిన ట్రస్ట్ అధ్యక్షులు పనస పూర్ణచంద్రరావు కు అలాగే రాధా రంగా మిత్రమండలి సభ్యులకు ధన్యవాదములు తెలియజేశారు కృష్ణ నియామకం పట్ల పలువురు అభినందనలు తెలియజేసి ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు



