✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు అమరావతి వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
End

