ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 4 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీఎల్వోలకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేసినట్లు డిప్యూటీ తహసిల్దార్ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే సవరణ కార్యక్రమంలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు. విధుల నిర్వహణకు అవసరమైన సూచనలు అందజేసి, ప్రతి కిట్లో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ తదితర వస్తువులు అందించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

బీఎల్వోలకు కిట్ల పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 4 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీఎల్వోలకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేసినట్లు డిప్యూటీ తహసిల్దార్ ప్రదీప్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు జరిగే సవరణ కార్యక్రమంలో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు. విధుల నిర్వహణకు అవసరమైన సూచనలు అందజేసి, ప్రతి కిట్లో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ తదితర వస్తువులు అందించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

